Friday, September 20, 2024
Homeసినిమాయూత్ మనసులు దోచేసిన 'ప్రేమలు' .. ఆహాలో!

యూత్ మనసులు దోచేసిన ‘ప్రేమలు’ .. ఆహాలో!

ఈ మధ్య కాలంలో తెలుగులో చెప్పుకోదగిన ప్రేమకథా చిత్రాలేం రాలేదు. అందువలన ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ కోసం చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేమకథా చిత్రమే ‘ప్రేమలు’. నస్లెన్ – మమిత బైజు జంటగా నటించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని అందుకుంది. చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన సినిమాగా నిలిచింది. గిరీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గురించి యూత్ అంతా మాట్లాడుకోవడం మొదలైంది.

ఓటీటీ సినిమాలలో ఇతర భాషా చిత్రాలను ఫాలో అయ్యేవారికి నస్లెన్ – మమిత బైజు ముఖ పరిచయమే. ఇక్కడి ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించేంత క్రేజ్ మాత్రం వారికి లేదు. ఏ భాషలో ఏ సినిమా ఏ రేంజ్ లో దూసుకువెళుతుందనేది సోషల్ మీడియా ద్వారా చాలా ఫాస్టుగా తెలిసిపోతోంది గనుక, ఈ సినిమా గురించి తెలుకున్న ప్రేక్షకులు థియేటర్స్ బాటపట్టారు. ఈ సినిమాకి ఇక్కడి నుంచి హిట్ కట్టబెట్టారు. పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా, మౌత్ టాక్ తో మంచి వసూళ్లను రాబట్టింది.

ఈ సినిమా టైటిల్ ‘ప్రేమలు’ కావడం .. కథ అంతా కూడా మన హైదరాబాద్ చుట్టూ తిరగడం వలన ఇక్కడి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా తెలుగు స్ట్రీమింగ్ హక్కులను ‘ఆహా’ వారు దక్కించుకున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్