Saturday, March 14, 2026
HomeTrending Newsమంగళవారం తెరాస విస్తృత స్థాయి సమావేశం

మంగళవారం తెరాస విస్తృత స్థాయి సమావేశం

శాసనసభ ఎన్నికలు మరో ఏడాది ఉండగానే రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. దానికి తోడు హుజూర్ నగర్ నుంచి నిన్నటి మునుగోడు వరకు ఉపఎన్నికలు ఎప్పటికప్పుడు ఎన్నికల వేడి సృష్టిస్తున్నాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి రావటం… ఆ కార్యక్రమానికి సిఎం కెసిఆర్ గైర్హాజరు కావటం బిజెపి – తెరాస ల మధ్య మాటల యుద్ధం…ఎన్నికల కొలహలాన్ని తలపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా కార్యోన్ముఖులను చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో… టిఆర్ఎస్.. లెజిస్లేటివ్ పార్టీ (ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు) పార్లమెంటరీ పార్టీ (ఎంపీలు).,టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం ..తో కూడిన సంయుక్త సమావేశం టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్నది. ఈ సమావేశంలో బిజెపి ఫోకస్ గా పార్టీ నేతలకు కెసిఆర్ దిశా నిర్దేశం చేయనున్నారని సమాచారం.

మరోవైపు ఈ సమావేశంలో యువనేత కేటిఆర్ కు TRSLP నేతగా పట్టం కట్టనున్నారని రాష్ట్రంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో కెసిఆర్ అంత సాహసం చేయరని విశ్లేషకులు భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికలు ముగిశాక వాటి ఫలితాలకు అనుగుణంగా కెసిఆర్ నిర్ణయం ఉంటుందని విశ్వసనీయ సమాచారం.

Also Read : అవినీతి కెసిఆర్ కు మోడీని కలవాలంటే భయం షర్మిల 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular