Sunday, September 8, 2024
Homeసినిమాప్రేమ‌కు.. విధికి మ‌ధ్య జ‌రిగే యుద్ధ‌మే ‘రాధేశ్యామ్’

ప్రేమ‌కు.. విధికి మ‌ధ్య జ‌రిగే యుద్ధ‌మే ‘రాధేశ్యామ్’

Radhe on promo track: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంట‌గా న‌టించిన భారీ పిరియాడిక్ ల‌వ్ స్టోరీ ‘రాధేశ్యామ్’. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. టీజ‌ర్, సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. ఈ మూవీని మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ రోజు రాధేశ్యామ్ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే “మనం ఆలోచిస్తున్నామని భ్రమపడతాం… మన ఆలోచనలు కూడా ముందే రాసుంటాయి..” అంటూ ప్రభాస్ వాయిస్ తో.. అదిరిపోయే విజువల్స్ తో రిలీజ్ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. “చేయి చూసి ఫ్యూచర్ ని.. వాయిస్ విని పాస్ట్ ని కూడా చెప్పేస్తావా?..” అని సచిన్ ఖేకేడర్ చెబుతున్న డైలాగ్ లు… “ఈయ‌న‌ ఎలా..? ఎప్పుడు..? చనిపోతాడో చెప్పనా…” అన‌డం. ‘ఇంకోసారి చేయి చూడు’ అని జ‌గ‌ప‌తిబాబు అంటే.. “నాకు రెండోసారి చూసే అలవాటు లేదు..” అంటూ ప్రభాస్ చెబుతున్న తీరు చూస్తుంటే.. వావ్ అనిపిస్తుంటుంది.

‘ప్రేమ విషయంలో ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు…’ అని పూజా హెగ్డే పాత్రతో చెప్పించిన డైలాగ్ లు … ట్రైలర్ చివర్లో ‘ప్రేమకీ విధికీ మధ్య జరిగే యుద్ధమే…’ అంటూ దర్శక ధీరుడు రాజమౌళి అందించిన వాయిస్ ఓవర్ వెరసి రాధేశ్యామ్ ట్రైలర్ అదిరింది అనిపిస్తుంది. ఈ ట్రైల‌ర్ లో క‌థ ఎలా ఉండ‌బోతుందో క్లారిటీ ఇచ్చేశారు. ఆ విజువ‌ల్స్… టాలీవుడ్, బాలీవుడ్ మూవీ కాదు.. హాలీవుడ్ మూవీ అనిపించేలా ఉన్నాయి. మ‌రి.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రాధేశ్యామ్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్