Tuesday, September 17, 2024
HomeTrending NewsRakhi: ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

Rakhi: ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు సంబరంగా సాగుతున్నాయి. అన్నా తమ్ముల్లకు సోదరీమణులు రాఖీలు కడుతూ ఆశీర్వాదం తీసుకుంటు…ఘనంగా చేసుకుంటున్నారు. పెసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టారు.

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. సోదరి సౌమ్య జోగినిపల్లితో కలిసి హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌ ట్విట్టర్‌ వేదిక ఫొటోలను షేర్‌చేశారు. అన్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని పేర్కొన్నారు.

అమ్మలోని మొదటి అక్షరం ‘అ’, నాన్నలోని చివరి అక్షరం ‘నా’ కలిపితే ‘అన్న’ అంటూ మంత్రి కేటీఆర్‌తో ఉన్న ఫొటోను ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్‌ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్