Friday, September 20, 2024
HomeTrending NewsKodangal: మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ దొంగలు - రేవంత్ రెడ్డి

Kodangal: మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ దొంగలు – రేవంత్ రెడ్డి

దాడులు చేయడం మా విధానం కాదు… అభివృద్ధి చేయడమే మా విధానం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం కొడంగల్, తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటించారు. దాడులు చేసి ఎన్నికల్లో గెలవాలనుకునే వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

కేసీఆర్, కేటీఆర్ దత్తత తీసుకుంటే కొడంగల్ కు ఏం జరిగింది? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రెండేళ్లలో కృష్ణా జలాలు తెచ్చి కాళ్లు కడుగుతామన్న కేసీఆర్…ఐదేళ్లయినా ఎందుకు తీసుకురాలేదు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కట్టకుండా కొడంగల్ కు నీళ్లు రావు. కనీసం మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలను కూడా నిర్మించలేదు. మరోసారి కొడంగల్ ప్రజలను మోసం చేయాలని బీఆరెస్ భావిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
“కొడంగల్ లో కట్టిన గుడి, బడి అన్నీ నా హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే.కొడంగల్ కు తాగునీరు తెచ్చి దాహార్తిని తీర్చింది నేను కాదా? కొడంగల్ నియోజకవర్గానికి 30 సబ్ స్టేషన్లు తెచ్చింది మేము..కొడంగల్ ప్రజలకు బస్ డిపో తెచ్చింది మేము…నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి మా హయాంలోనే జరిగింది. బీఆరెస్ హయాంలో నారాయణ్ పేట్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయకుండా కొడంగల్ కి అన్యాయం చేశారు.. నేను చేసిన పనులకు శిలాఫలకాలు వేయడం తప్ప బీఆరెస్ చేసిందేం లేదు. జిల్లాలు పెంచి కొడంగల్ ను ముక్కలు చెక్కలు చేశారు” అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
“నిన్న మొన్న ఒకాయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటానంటే…నాలుగేళ్లు అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం ఇప్పుడు అతని కడుపులో తలపెట్టిండు. ఇవాళ మంత్రి పదవి ఇచ్చిండు…నిన్నటి వరకు జట్లు జట్లు పట్టుకున్నోళ్లు ఇవాళ పదవులు పంచుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ మూడు రంగుల జెండాకు ఉన్న పవర్ వాళ్లకు మంత్రి పదవులు వచ్చాయి తప్ప… తాండూరుకు ఒరిగిందేంటి ” అని రేవంత్ రెడ్డి మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలను ఎద్దేవా చేశారు.
అసలు తెలంగాణలో సామాజిక న్యాయం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి.
మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ముగ్గురూ తోడు దొంగలు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. కారు ఢిల్లీకి వెళ్లి కమలం అవుతోందని బీఆర్ఎస్ పార్టీ పై సెటైర్ వేశారు. బీఆరెస్, ఎంఐఎం కు ఓటు వేస్తే మోదీకి వేసినట్టే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

చేవెళ్ల సభ ఏర్పాట్ల పరిశీలన

ఈ నెల 26న చేవెళ్లలో జరిగే ప్రజాగర్జన సభ ఏర్పాట్లను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ఏర్పాట్లపై పార్టీ నాయకులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజా గర్జన సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్