Friday, September 20, 2024
Homeసినిమాసలార్.. అంతకు మించి అంటున్న టీజర్

సలార్.. అంతకు మించి అంటున్న టీజర్

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ప్రభాస్ అభిమానులే కాదు.. సినీ అభిమానులు కూడా ఆతృతగా ఎదురుచూశారు. ఇక ఈ మూవీ టీజర్ వస్తుందని ప్రకటించినప్పటి నుంచి మరింత ఆసక్తి పెరిగింది. అయితే.. ఫస్ట్ టైమ్ సినిమా అభిమానులు అలారమ్ పెట్టుకుని మరీ లేచి టీజర్ చూసేలా చేశాడు ప్రశాంత్ నీల్. ఇక ఈ టీజర్ తో సలార్ రెండు పార్టులుగా రానుందనే క్లారిటీ వచ్చింది.

ఇక టీజర్ విషయానికి వస్తే.. 1.46 నిమిషాల ఈ టీజర్ సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదం కానీ.. జురాసిక్ పార్క్ లో కాదు. ఎందుకంటే ఆ పార్క్ లో.. అంటూ టీనూ ఆనంద్ డైలాగ్ తో ఈ టీజర్ స్టార్ట్ అయ్యింది. దీనిని బట్టి ప్రభాస్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించబోతున్నారని ప్రేక్షకాభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయని అర్థం అవుతుంది. అయితే.. 1.12 నుంచి 1.20 వరకు అంటే ఎనిమిది సెకెండ్ల పాటు ప్రభాస్ ను చూపించారు. అది కూడా ఫేస్ ను పూర్తిగా చూపించనే లేదు. అతని మీద మాంచి పవర్ ఫుల్ డైలాగు పడనే లేదు. కానీ ఈ మొదటి 1.12 నిమషాల పాటు ఇచ్చిన బిల్డప్, చూపించిన సీన్లు, కనిపించిన సెటప్ అంతా మాత్రం ఓ రేంజ్ లో వుంది.

కేజిఎఫ్ 2 లెవెల్ లో ఉండే సినిమా చూస్తున్నామనే ఫీల్ ను పక్కాగా కలిగించింది. ఈ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో అయితే.. హాడావిడి మామూలుగా లేదు. దీనిని బట్టి సలార్ సినిమాకి కనీవినీ ఎరుగని రేంజ్ లో ఓపెనింగ్ రావడం ఖాయం అని ఖచ్చితంగా చెప్పచ్చు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ టీజర్ రిలీజ్ చేయడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక నుంచి సలార్ నుంచి వరుసగా అప్ డేట్స్ రానున్నాయి.  బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ ప్రభాస్ కు రాలేదు. మరి.. సలార్ అంతకు మించి అనేలా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్