Friday, September 20, 2024
HomeTrending NewsJPS Issue: జేపీఎస్ లకు అండగా నిలవండి - బండి సంజయ్

JPS Issue: జేపీఎస్ లకు అండగా నిలవండి – బండి సంజయ్

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు(జేపీఎస్) రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులన్నీ అండగా నిలవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా సమ్మె చేస్తున్న జేపీఎస్, ఓపీఎస్ ల ఇండ్ల వద్దకు, సమ్మె చేస్తున్న ప్రాంతాలకు వెళ్లి పూర్తిస్థాయిలో సంఘీభావం తెలపాలని కోరారు. అంతేగాకుండా జేపీఎస్ ల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పక్షాన క్షేత్ర స్థాయిలో ఎక్కడికక్కడ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వారి సమ్మెకు మద్దతు ఇతర శాఖల ఉద్యోగులను భాగస్వాములను చేసి జేపీఎస్ లు ఒంటరి కాదనే సంకేతాలను పంపాలని కోరారు.

• ఈరోజు ఉదయం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు, అసెంబ్లీ కన్వీనర్లు, కో కన్వీనర్లతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హాజరైన ఈ టెలికాన్ఫరెన్స్ లో బండి సంజయ్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంఘీభావం తెలిపే అంశంతోపాటు ఈనెల 11న సంగారెడ్డిలో నిర్వహించే ‘‘నిరుద్యోగ మార్చ్’’, 14న కరీంనగర్ లో నిర్వహించే ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ అంశాలపైనా దిశానిర్దేశం చేశారు. అందులోని ముఖ్యాంశాలు..

• జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నారు. వారు చేస్తున్న సమ్మె పూర్తిగా న్యాయమైనదే. కష్టపడి పరీక్ష రాసి సెలెక్టై ఉద్యోగాల్లో చేరిన జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోంది. వాస్తవానికి ఏ ఉద్యోగానికైనా రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటే వీరికి మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ గా నిర్ణయించారు. ఆ తరువాత మరో ఏడాది పెంచారు. అయినప్పటికీ జూనియర్ కార్యదర్శులు అన్నీ భరించి 4 ఏళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ను పూర్తి చేసిన తరువాత కూడా రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయం.

• ఈరోజు గ్రామాల్లో అంతో ఇంతో అభివ్రుద్ధి జరుగుతోందంటే…. గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చాయంటే కారణం జూనియర్ పంచాయతీ కార్యదర్శులే. అయినా వీళ్లపై ప్రభుత్వం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. ఈరోజు సాయంత్రంలోపు విధుల్లో చేరకుంటే సమ్మె చేస్తున్న జేపీఎస్ లను తొలగిస్తామని హెచ్చరించింది.

• జేపీఎస్ ల డిమాండ్లకు బీజేపీ మద్దతిస్తోంది. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో జేపీఎస్ ల సమ్మెలో పాల్గొని స్వయంగా సంఘీభావం తెలిపాను. వారిని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ సీఎంకు లేఖ రాశాను. అయినా కేసీఆర్ ప్రభుత్వం పెడచెవిన పెట్టడమే కాకుండా వాళ్లను తొలగించేందుకు కుట్ర చేస్తోంది. పోలీసులను, అధికారులను జేపీఎస్ ల ఇండ్లకు పంపి సమ్మె చేస్తే కేసులు పెడతాం… అరెస్ట్ చేస్తాం… జైళ్లకు పంపుతామంటూ ప్రభుత్వం బెదిరిస్తోంది.

• ఈ సమయంలో జేపీఎస్ లకు పూర్తిస్తాయిలో అండగా నిలవాల్సిన అవసరం ఉంది. మీరంతా జేపీఎస్ ల ఇండ్లకు వెళ్లండి. సమ్మెకు సంఘీభావం తెలపండి. ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదు. అండగా బీజేపీ ఉందనే సంకేతాలను పంపండి. అందులో భాగంగా జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పక్షాన ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం కండి. వారి సమ్మెకు మద్దతు ఇతర శాఖల ఉద్యోగులను భాగస్వాములను చేసి జేపీఎస్ లు ఒంటరి కాదనే సంకేతాలను పంపండి.

• అట్లాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యుడైన ఐటీశాఖ మంత్రిని కేబినెట్ నుండి తొలగించాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలనే ప్రధాన డిమాండ్లో ఈనెల 11న సంగారెడ్డిలో నిర్వహించబోయే ‘‘నిరుద్యోగ మార్చ్’’లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి.

• ముఖ్యంగా ఈనెల 14న కరీంనగర్ లో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ను కనీవినీ ఎరగని రీతిలో నిర్వహించబోతున్నాం. భజరంగ్ దళ్ ను నిషేధిస్తామంటూ కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తరువాత హిందూ ధర్మరక్షకులంతా ఏకమవుతున్నారు. తెలంగాణలోనూ హిందువుల సత్తా తెలిపేందుకు.. తెలంగాణ వ్యాప్తంగా హిందుత్వ వాతావరణం వెల్లివిరిసేలా ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ను నిర్వహించబోతున్నాం. దాదాపు లక్ష మందికిపైగా ఈ యాత్రకు హాజరయ్యే అవకాశముంది. రాజకీయాలకు అతీతంగా పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీల్లేకుండా హిందూ ఏక్తా యాత్ర పేరుతో నిర్వహించబోతున్నాం. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్ కూడా హాజరవుతారు. ప్రతి ఒక్క కార్యకర్తతోపాటు, హిందూ ధర్మ రక్షకులంతా ఈ యాత్రలో పాల్గొని హిందూ సంఘటిత శక్తిని చాటాలని కోరుతున్నా.

• పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ పంట నష్టపోయిన ప్రాంతాల్లో రైతులకు భరోసా నింపేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ జిల్లాల వారీగా ముఖ్య నేతల కమిటీని నియమించినందున…స్థానిక నేతలంతా వారితో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులకు అండగా నిలవాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్