బేబీ ఆస్కా సమర్పణలో మ్యాక్ కింగ్ క్రియేషన్స్ పతాకంపై అబ్రార్ ఖాన్, ఐశ్వర్య జంటగా నటించిన చిత్రం ‘ఓ మధు’. రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో ఏ.యమ్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ సునీత లక్ష్మారెడ్డి సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నగేష్, నిర్మాత సత్యారెడ్డి, ఆడిషినల్ యస్.పి.లక్ష్మణ్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్ ను ఆశీర్వదించారు.
సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ “ట్రైలర్ చాలా బాగుంది. మా ముందు పుట్టి పెరిగిన అబ్బాయి ఈ రోజు హీరోగా ఎదగడం చాలా సంతోషంగా ఉంది. తల్లి కోరిక తన కొడుకు డాక్టర్ కావాలని, తండ్రి కోరిక యాక్టర్ అవ్వాలని. అందుకే హీరో డాక్టర్ గా, యాక్టర్ గా రాణించి తల్లిదండ్రులు కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ఈ నెల 29 న విడుదల అవుతున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు పెద్ద సక్సెస్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.
హీరో అబ్రార్ ఖాన్ మాట్లాడుతూ “మా ‘ఓ మధు’ చిత్రాన్ని ఆశీర్వదించదానికి వచ్చిన సునీత లక్ష్మారెడ్డి మేడమ్ కు, నగేష్ సర్ కు అలాగే అనేక మంది పెద్దలకు నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ రోజు నేను ఈ స్టేజ్ పై నిల్చోడానికి కారణమైన నా తల్లిదండ్రులకు పాదాభివందనం. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది” అన్నారు.