Friday, September 20, 2024
HomeTrending Newsసర్వే సంస్థల అంచనా హాస్యాస్పదం: సజ్జల

సర్వే సంస్థల అంచనా హాస్యాస్పదం: సజ్జల

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని, జూన్ 4న ఓట్ల లెక్కింపు రోజున కుట్ర జరిగే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు, అక్రమాలు చేసైనా గెలిచేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తారని, అందుకే వైసీపీ నేతలు, పోలింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూటమి నేతలు కుట్రలకు తెరతీసినా, ధైర్యంగా పోరాడాలి కానీ సంయమనం కోల్పోవద్దని సజ్జల విజ్ఞప్తి చేశారు.  చేశారు.

జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి నేడు జూమ్‌ మీటింగ్‌ సజ్జల నిర్వహించారు. రూల్స్ ప్రకారం వైసీపీకి పడిన ప్రతిఓటు మనకు వచ్చేలా చూడాలన్నారు. ఏదైనా తప్పు జరిగినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ కౌంటింగ్ కేంద్రంలో అప్రమత్తంగా ఉండాలని లేకపోతే కుట్రలు చేసైనా వారు గెలవాలని చూస్తారని ఆరోపించారు.

పోస్టల్ బ్యాలెట్‌పై ఏమైనా అనుమానుం వస్తే కచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఇంకా అవసరమైతే పార్టీ అధిష్టానానికి సమాచారం ఇవ్వాలని ఏజెంట్లకు సూచించారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ గెలుస్తుందని, వరుసగా రెండోసారి జగన్ ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో స్థానికంగా ప్రముఖ సర్వే సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని వెల్లడించాయి. రాష్ట్రం గురించి అవగాహనా లేని కొన్ని నేషనల్‌ మీడియా సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే నవ్వొస్తుందన్నారు. ఒడిశాలో బీజేడీకి 0 సీట్లు ఇచ్చారు, తమిళనాడులో 9 సీట్లలో పోటీ చేస్తే 14 చోట్ల గెలుస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలా పలు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలమైన ఫలితాలు ఇచ్చినట్లు ప్రజలు గుర్తించారన్నారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరిపి బీజేపీ పంచన చేరారని, అంతా ఏకమై సీఎం జగన్‌ను ఓడించాలని గట్టిగా ప్రయత్నాలు చేశారని, అయినా మేం పేదల కోసం పని చేశామని వివరించారు. ఆ అన్ని పార్టీలు ఏకం కావడంతో సౌండ్ పెద్దగా వచ్చిందని, దాంతో ఎన్నికల కమిషన్ పై సైతం ఒత్తిడి పెంచి రాష్ట్రంలో మార్పులు చేర్పులు చేశారని విమర్శించారు. పోస్టల్ బ్యాలెట్లపై ఆఖరికి సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడతామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్