Monday, March 16, 2026
HomeTrending NewsTDP: ప్రధానికి ఫిర్యాదు చేస్తాం: కేశినేని

TDP: ప్రధానికి ఫిర్యాదు చేస్తాం: కేశినేని

నిన్న పుంగనూరులో జరిగిన ఘటనపై జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.  రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రధానికి ఫిర్యాదు చేస్తామని విజయవాడ ఎంపి, తెలుగుదేశం పార్టీ నేత కేశినేని నాని వెల్లడించారు. తమ ఎంపీల బృందం సోమవారం ప్రధాని మోదీని కలుస్తుందని, శాంతిభద్రతలు సరిగా లేకుంటే అభివృద్ధి జరగదని, వైసీపీ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగినందునే దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబుపైనే దాడులు జరుగుతుంటే.. సమాన్యుల సంగతేంటని కేశినేని ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ లు అధికార పార్టీ నేతల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular