Friday, September 20, 2024
HomeTrending NewsTPCC: కాంగ్రెస్ కార్యకర్తలే నా సైన్యం... నా సెక్యూరిటీ - రేవంత్ రెడ్డి

TPCC: కాంగ్రెస్ కార్యకర్తలే నా సైన్యం… నా సెక్యూరిటీ – రేవంత్ రెడ్డి

న్యాయస్థానం చెప్పినా ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వడం లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎంపీగా ఉన్నాను, జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు సెక్యూరిటీ తొలగిస్తారా అని ప్రశ్నించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా గాంధీభవన్ లో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరు అక్షేపనీయం అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కి కావాల్సినంత సెక్యూరిటీ ఇచ్చామని, ప్రజల మనిషిని తనకు సెక్యూరిటితో పనిలేదు. సెక్యూరిటీ లేకుండ ఎక్కడికైనా వస్తానన్నారు.

రేవంత్ రెడ్డి చిట్ చాట్

సెక్యూరిటీ లేకుండ ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు కేసీఆర్ రాగలరా? నన్ను ఓడించడానికి పోలీసులను కేసీఆర్ వాడుకున్నారు. సెక్యూరిటీ విషయంలో నన్ను భయపెట్టాలని చూస్తే భయపడేవాడ్ని కాదు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నా సైన్యం. నా సెక్యూరిటీ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ మైనార్టీ అనే తేడా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ మైనార్టీల కోసం ఏం చేయలేదు. డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఒక్క పర్సెంట్ కూడా మైనార్టీలకు దక్కలేదు. ఇక్కడ కారు బయల్దేరి ఢిల్లీకి చేరే వరకు అది కమలంగా మారిపోతోంది. టీఆర్ఎస్ కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే.

కేసీఆర్ మైనార్టీ ఓట్లను బీజేపీకి అమ్ముకుంటున్నారు. మైనార్టీలందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. బీజేపీ తెచ్చిన ప్రతి ప్రజా వ్యతిరేక బిల్లుకి కేసీఆర్ మద్దతు ఇచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ వేరువేరు కాదు. బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పడానికి ఎక్కడికైనా వస్తాం. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని గుడి, మసీదు, చర్చి ఎక్కడికైనా వచ్చి చెప్తాం. బీఆర్ఎస్ వాళ్ళు అలా చెప్పగలరా? అన్ని డిపార్ట్మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారు. ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్ లో రాస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటాం.

ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టం. నేను అనేది ప్రభాకర్ రావు, రాధ కిషన్ రావు, భుజంగ రావు, నర్సింగ్ రావు లాంటి అధికారులనే. ప్రజల కోసం పనిచేసే అధికారులపై నాకెప్పుడూ గౌరవం ఉంటుంది. ప్రభుత్వ అధికారులుగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని అంటున్న వాళ్ల విషయంలో సైలెంట్ గా ఎలా ఉంటాం. అధికారులకు రాజకీయాలతో ఎం సంబంధం? పది సంవత్సరాల్లో చేయనిది రెండు నెలల్లో ఎలా చేస్తారు? ఒక్క ఎకరానికి వంద కోట్లు పెట్టగలిగేలా బీఆర్ఎస్ నేతలు ఎదిగారు. పేద ప్రజలు మాత్రం పేదలుగానే ఉంటున్నారు. కోకాపేట, బుద్వెల్ లో భూములు కొన్న సంస్థల పేర్లు ఎందుకు చెప్పడం లేదు. కోకాపేట, బుద్వెల్ లో భూములు కొన్నది బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ బీనామీలే. ఆర్టిఫీషియల్ బూమ్ క్రియేట్ చేసెందుకు బీఆర్ఎస్ నాయకులు అద్భుతమైన నాటకం ఆడారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్