Tuesday, April 15, 2025
HomeTrending Newsవిదేశాలకు వెళ్లేవారికి టీకాలు

విదేశాలకు వెళ్లేవారికి టీకాలు

తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్లేవారికి ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యాక్సిన్‌ వేయించుకోవాలనుకున్న వారు పాస్‌పోర్టు, వీసా చూపించి తొలిడోసు తీసుకోవచ్చు.

రెండో డోసు వేసేటప్పుడు మాత్రం పాస్‌పోర్టు, వీసాలను కొవిన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. విదేశాలకు వెళ్లేవారికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. 28 రోజుల తర్వాత రెండో డోసు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారులు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ప్రజారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్