Saturday, March 14, 2026
HomeTrending Newsరాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీయార్ టూర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీయార్ టూర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు పాల్గొన్నారు.  తొలుత మండేపల్లిలో పేదల కోసం రూ. 87 కోట్లతో సకల వసతులతో నిర్మించిన 1320 డబుల్‌ బెడ్రూం ఇండ్లను ముఖ్యమంత్రి ప్రారంభించి లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్మించిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular