అపోలో ఆసుపత్రిలో కిడ్నీ సమస్య తో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావుకు ఫోన్ చేసి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల సలహాలు ఖచ్చితంగా పాటించాలని, ఆరోగ్యం కోలుకుని తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని చెప్పిన వెంకయ్య నాయుడు.
తనను గుర్తు పెట్టుకొని పరామర్శించిన వెంకయ్యకు ధన్యవాదాలు తెలిపిన వి.హెచ్. ఉప రాష్ట్రపతి పరామర్శతో నాకు చాలా ఉత్సాహం వచ్చిందని తెలిపారు.