Saturday, March 14, 2026
HomeTrending Newsప్రధానిని కలుసుకున్న విజయసాయి

ప్రధానిని కలుసుకున్న విజయసాయి

Vijayasai met PM Modi:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో నేడు కలుసుకున్నారు.  ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాలలో ఏపీకి సంబంధించి లేవనెత్తిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువచ్చిన విజయసాయి, వాటి సత్వరమే పరిష్కరించాలని విన్నవించారు.

విశాఖకు సంబంధించి పలు అంశాలపై విజయసాయి రెడ్డి రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానమిచారు.  విశాఖ పోర్టు ట్రస్ట్‌ లోని ఔటర్‌ హార్బర్‌లో క్రూయిజ్‌ టెర్మినల్‌ బెర్త్‌, భవన నిర్మాణం కోసం రూ. 96 కోట్లు, క్రూయిజ్‌ కమ్‌ కోస్టల్‌ కార్గో టెర్మినల్‌ నిర్మాణం కోసం రూ. 38 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

Also Read : ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రతకు చర్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular