Sunday, September 8, 2024
HomeTrending Newsమునుగోడులో మోసగాళ్లు.. మెగా మోసగాళ్ల మధ్య పోటీ - షర్మిల

మునుగోడులో మోసగాళ్లు.. మెగా మోసగాళ్ల మధ్య పోటీ – షర్మిల

మనుషులనే కాదు దేవుళ్ళను సైతం కేసీఅర్ మోసం చేశాడ YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ధర్మపురి ఆలయానికి వందల కోట్లు అని పూటకో మాట చెప్పాడు కేసీఅర్ అని ధ్వజమెత్తారు. షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ధర్మపురి నియోజక వర్గం మీదుగా ఈ రోజు సాగుతోంది. ధర్మపురిలో ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ…ధర్మపురికి ఒకసారి 500 కోట్లు అన్నాడు.. మల్లోసారి 200 కోట్లు అన్నాడు..ఇప్పుడు 100 కోట్లు అన్నాడని కెసిఆర్ పై ఆరోపణలు చేశారు.

షర్మిల విమర్శలు ఆమె మాటల్లోనే…

ధర్మపురికి ఒక్క కోటి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. కేసీఅర్ కి యాదాద్రి తప్పా మిగతా ఆలయాల అభివృద్ధి పట్టదు. మనుషులనే కాదు..దేవుళ్ళను సైతం అబద్ధపు హామీలు చెప్పి మోసం చేశారు. YSR ఇదే ధర్మపురికి 30 పడకల ఆసుపత్రి ఇస్తే.. కెసిఆర్ 100 పడకల ఆసుపత్రి చేస్తామని మరిచారు. రెవెన్యూ డివిజన్ చేస్తామని కేసీఅర్ మోసం చేశారు. చెక్ డ్యాం లు అని మోసం… లక్ష్మి నరసింహ స్వామీ రిజర్వాయర్ అని మోసం చేశాడు. అసెంబ్లీ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. రిజర్వాయర్ కట్టినట్లు హరీష్ రావు వచ్చి హడావిడి చేశాడు. కనీసం ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనే చిత్తశుద్ది కూడా లేదు.

ఇక స్థానిక ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్…ఈయన కొప్పులో మంత్రి పదవి కూడా ఉంది. చావు తప్పి కన్ను లోట్టపోయినట్లు 440 ఓట్లతో గెలిచి కులం కోటా కింద మంత్రి పదవి దక్కించుకున్నాడు. మంత్రి నియోజకవర్గానికి కాదు..ఆయనకే. వందల ఎకరాలు భూ కబ్జాలు… ఇసుక మాఫియా. రామగుండం ఎరువుల కార్మాగారంలో ఉద్యోగాలు ఇప్పిస్తా అని డబ్బులు వసూలు చేశారు. ప్రశ్నిస్తే జర్నలిస్ట్ లపై కేసులు..సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్ లో పెట్టీ చితక బాదిస్తరట. రాళ్లవాగు ప్రాజెక్ట్  చెడిపోతే 100 కోట్లు పెట్టీ మరమత్తులు అని చెప్పి మోసం చేశారు. వరదల్లో ఎంతో మంది ఇల్లు కొట్టుకుపోతే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం అధికారం కోసమే..అధికారం అనుభవించడానికి మాత్రమే మంత్రి పదవి.

మునుగోడులో జరుగుతున్నవి మోసగాళ్ళకు, మొనగాళ్లకు మద్య జరుగుతున్న ఎన్నికలని తెరాసా నేతలు అంటున్నారు. ఎవరు మోసగాళ్లు,ఎవరు మొనగాళ్లు..? బీజేపీ మోసగాళ్లు నిజమే..మీరు మెగా మోసగాళ్లు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసిన మెగా మోసగాళ్ళు. డబుల్ బెడ్ రూం అని చెప్పి మోసం చేసిన మెగా మోసగాళ్లు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేసిన మెగా మోసగాళ్లు మీరు. మెగా మోసం చేసిన తెరాస నేతలు 420 గాళ్ళు. ఎంతో మందిని ముంచారు. ప్రతి ప్రాజెక్ట్ ను మెగా కంపెనీకి కట్ట బెట్టిన మెగా మోసగాళ్లు మీరు. మీరు మీరు కమీషన్ లు తీసుకున్న మెగా మోసగాళ్లు. ఒట్లేస్తేనే అభివృద్ధి అని చెప్పిన మెగా మోసగాళ్లు కేసీఅర్,కెటిఆర్.

తెలంగాణలో YSR ప్రతి పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు..అరోగ్యశ్రీ లేదు. వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఉద్యోగాలు ఇచ్చే దిక్కు లేదు. 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరిహారం ఇచ్చే దిక్కు లేదు. కేసీఅర్ పాలనలో బాగుపడ్డ వర్గం లేనే లేదు. బంగారు తెలంగాణ కేసీఅర్ కుటుంభానికి అయ్యింది. ఇది అప్పుల తెలంగాణ..ఆత్మహత్యల తెలంగాణ. తెలంగాణ ఖజానా మొత్తం కొల్లగొట్టారు. రాష్ట్ర సంపదను మొత్తం దోచుకు తిన్నారు. కేసీఅర్ ఇంత అవినీతి చేస్తున్నా..అడిగే వాడు లేడు. తెలంగాణలో ప్రశ్నించే పార్టీ లేనే లేదు. మాట మీద నిలబడే న్యాయకత్వం లేనే లేదు. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టాం. మీరు ఆశీర్వదించండి… వైఎస్సార్ సంక్షేమ పాలన తెస్తా

RELATED ARTICLES

Most Popular

న్యూస్