Tuesday, June 9, 2026
HomeTrending Newsకెసిఆర్ ను కలిసిన గెల్లు

కెసిఆర్ ను కలిసిన గెల్లు

హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తనకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, టిఆరెఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు ను శుక్రవారం ప్రగతిభవన్ లో కలిసి కృతజ్జతలు తెలిపిన టిఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్.

దళిత బంధు పథకం ప్రారంభం కోసం హుజురాబాద్ రానున్న కెసిఆర్ అంతకు ముందే పార్టీ అభ్యర్థిని ప్రకటించటంతో గులాబి శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. బిసి వర్గం నుంచి అభ్యర్థిని ఎంపిక చేయటం, తెలంగాణ ఉద్యమ నేపథ్యం, విద్యార్థి నాయకుడిగా అనుభవం గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు కలిసి వస్తుందని పార్టీ వర్గాలు అంచన వేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular