Sunday, March 15, 2026
HomeTrending Newsఅర్జెంటినా నుంచి భారత్ కు వంటనూనె

అర్జెంటినా నుంచి భారత్ కు వంటనూనె

వచ్చే నెలలలో భారత్ లో జరిగే జి 20 సమావేశాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అర్జెంటినా ప్రకటించింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్ అర్జెంటినా విదేశాంగ మంత్రి సాంటియాగో కఫిరోతో జరిగిన సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. ఆ దేశ రక్షణ మంత్రితో జరిగిన సమావేశంలో రక్షణ రంగంలో సహకారంపై వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇండియా-అర్జెంటీనా సంబంధాలు ఆ దేశంలో వివిధ రంగాల్లో ఉన్న భారతీయుల ద్వారా మరింత బలోపేతం అవుతాయని విదేశాంగ మంత్రి జై శంకర్ ఆకాంక్షించారు. ఆ తర్వాత అర్జెంటినా వ్యాపార వేత్తలతో సమావేశమైన జై శంకర్…  భారత్ లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని అర్జెంటినా వ్యాపారులు తరలిరావాలని ఆహ్వానం పలికారు.

భారతదేశం సన్‌ఫ్లవర్ నూనె అవసరాల కోసం ఉక్రెయిన్‌పై అసమానంగా ఆధారపడి ఉంది. గత 4 సంవత్సరాలలో సుమారు 9.40 మిలియన్ మెట్రిక్ టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను భారతదేశం దిగుమతి చేసుకుంది, అందులో 81%, అంటే 7.60 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉక్రెయిన్ నుండి దిగుమతి చేయబడ్డాయి మరియు మిగిలినది అర్జెంటీనా ఇతర దేశాల నుండి వచ్చింది. రష్యా ఉక్రెయిన్ వివాదంతో అర్జెంటీనా సన్‌ఫ్లవర్ రావడం అధికమైంది.

లాటిన్ అమెరికా దేశాలతో భారత సంబంధాలను పెంపొందించుకోవడానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్ బ్రెజిల్, పరాగ్వే, అర్జెంటీనా దేశాల పర్యటన ఎంతగానో మేలు చేకుర్చనుంది. ఈ మూడు దేశాల అగ్ర నాయకత్వాలతో మంత్రి జరిపిన సమావేశాలు… వాటిల్లో ముఖ్యంగా ఆహారం, ఇంధన భద్రత, రక్షణ మరియు భద్రత, అంతరిక్షం, ఐటీ మరియు ఏరోస్పేస్‌పై దృష్టి సారించారు.  ఆగస్టు 22న ప్రారంభమై ఈ రోజు వరకు (27 తేదీ) బ్రెజిల్, పరాగ్వే, అర్జెంటీనాల్లో పర్యటించిన మంత్రి దక్షిణ అమెరికా ప్రాంతానికి వెళ్లడం ఇదే తొలిసారి. బ్రెజిల్ మరియు అర్జెంటీనా పర్యటనల సందర్భంగా, మంత్రి తన సహచరులతో జాయింట్ కమిషన్ సమావేశాలకు (JCM) సహ-అధ్యక్షుడుగా వ్యవహరించారు.  ద్వైపాక్షిక సంబంధాల సమీక్ష, ఉమ్మడి ప్రయోజనాలు, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించారు. బ్రెజిల్, అర్జెంటీనా రెండూ భారతదేశానికి వ్యూహాత్మక భాగస్వాములు.

ఇండియా-బ్రెజిల్ రెండు నౌకాదళాల కసరత్తు సమయంలో అంతర్-ఆపరేటబిలిటీ మరియు రెండు దేశాల మధ్య దౌత్య మరియు సముద్ర సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. రెండు దశాబ్దాలలో ఇది దక్షిణ అమెరికాకు భారత నౌకాదళ నౌకను మోహరించడం… రెండు దేశాల నౌకాదళాలు వ్యూహాత్మక విన్యాసాలు, క్రాస్ డెక్ ల్యాండింగ్… వంటి బహుముఖ కార్యకలాపాలలో పాల్గొన్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఆగస్టు 15న రియో ​​డి జెనీరోలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి భారత్ కు అభినందనలు తెలిపినందుకు విదేశాంగ మంత్రి కృతఙ్ఞతలు తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular