Saturday, July 27, 2024
Homeసినిమా'18 పేజిస్' 'నన్నయ్య రాసిన' లిరికల్ వీడియో విడుదల

’18 పేజిస్’ ‘నన్నయ్య రాసిన’ లిరికల్ వీడియో విడుదల

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం ‘18 పేజిస్‘ నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇది వరకే రిలీజైన ఈ చిత్ర టీజర్ సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇటీవలే ‘కార్తికేయ-2’ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్ సిద్ధార్థ & అనుపమ. కృష్ణ తత్వాన్ని, కృష్ణ సారాంశాన్ని చెప్పిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలక్షన్స్ సాధించింది. అంతటి ఘన విజయం సాధించిన కార్తికేయ- 2 తరువాత అనుపమ, నిఖిల్ జంటగా చేస్తున్న చిత్రం కావడంతో ఈ “18 పేజిస్” సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

తాజాగా ’18 పేజిస్ చిత్రం నుండి ‘నన్నయ్య రాసిన’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటను లిరిసిస్ట్ శ్రీమణి రచించారు. ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పెలైన తెలిపేనా ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైన చూపేనా నీలో స్వరాలకే నేనే సంగీతమై.. నువ్వే వదిలేసిన పాటై సాగేనా నన్నయ్య రాసిన కావ్యమగితే, తిక్కన తీర్చేనుగా, రాధమ్మ ఆపిన పాట మధురిమా కృష్ణుడు పాడెనుగా అని శ్రీమణి రచించిన లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ‘నన్నయ్య రాసిన’ పాటను పృథ్వి చంద్ర, సితార కృష్ణ కుమార్ ఆలపించారు. ఈ పాట వినసొంపుగా ఉంది. ఖచ్చితంగా ఈ పాట మంచి మెలోడీ హిట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ని సుకుమార్ రాశారు. ఇది వరకే గతంలో ‘కుమారి 21 ఎఫ్’ చిత్రంతో హిట్ అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్