Thursday, April 10, 2025
Homeస్పోర్ట్స్Hockey-Asian Champions: మలేషియాపై ఇండియా విజయం

Hockey-Asian Champions: మలేషియాపై ఇండియా విజయం

ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ-2023 లో నేడు జరిగిన మ్యాచ్ లో  మలేషియాపై ఇండియా 5-0 తేడాతో ఘనవిజయం సాధించింది.

ఈ టోర్నీ కి చెన్నై ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో ఈ మ్యాచ్ లు అన్నీ జరుగుతున్నాయి,

తొలి పావు భాగం చివరి క్షణాల్లో ఇండియా ప్లేయర్ సెల్వం కార్తీ ఫీల్డ్ గోల్ తో ఇండియాకు బోణీ కొట్టాడు. ఆ తర్వాతా 32, 42 నిమిషాల్లో హార్దిక్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్ లు రెండు పెనాల్టీ కార్నర్ గోల్స్ సాధించారు. 53 వ నిమిషంలో గుర్జాంత్ సింగ్ ఫీల్డ్ గోల్ చేయగా, 54 వ నిమిషంలో జుగ్ రాజ్ సింగ్ మరో పెనాల్టీ కార్నర్ ద్వారా స్కోరును 5-0కు చేర్చాడు.

లీగ్ దశలో మొత్తం ఆరు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా మూడు మ్యాచ్ లు ఆడిన ఇండియా రెండు విజయాలు, ఒక డ్రా తో మొత్తం ఏడు పాయింట్లుతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్