Sunday, September 22, 2024
HomeTrending Newsతెలంగాణ గడ్డ నాకు ధైర్యం ఇచ్చింది

తెలంగాణ గడ్డ నాకు ధైర్యం ఇచ్చింది

పోరాటం చేస్తేనే అడుగు ముందుకు వేయగలమని తెలుసు… భయపెట్టిన కొద్దీ బలపడతాం తప్ప భయపడే ప్రసక్తేలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని అజీజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ‘‘రాజకీయాల్లోకి వస్తుంటే అందరూ నన్ను భయపెట్టారు.. కానీ, తెలంగాణ గడ్డ నాకు ధైర్యం ఇచ్చింది. 2009లో రాజకీయాలు నా ఆధీనంలో లేవు. అప్పుడు పార్టీ వేరొకరి చేతిలో ఉంది. రాజకీయ చదరంగంలో జనసేనది సాహసోపేత అడుగు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి నన్ను నడిపిస్తోంది. తెలంగాణ ప్రజలకు నేను రుణపడి ఉన్నా. రాజకీయాలకు బలమైన భావజాలం ఉంటే చాలు’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

తెలంగాణ ఉద్యమ పోరాట స్పూర్తితోనే జనసేన పార్టీని ఏర్పాటు చేశానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కొత్త తరం రాజకీయాల్లోకి రావడానికి జనసేన ఉపయోగిపడ్తోందని, మార్పు కోసం దెబ్బలు తినటానికైనా సిద్దమని జనసేన అధినేత స్పష్టం చేశారు. దెబ్బలు తింటూనే ఏపీలో పంచాయతీలు, ఎంపీటీసీలను జనసేన గెలిచిందని, తెలంగాణ జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ అన్నారు.

బలమైన మార్పు కోసం పోరాటం చేస్తానని, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు 2009లో పర్యటించానని పవన్ తెలిపారు. రాజకీయ చదరంగంలో ఒక్క అడుగైనా ఆలోచనతో ముందుకు వెయ్యాలని, అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా చెప్పారు. రాజకీయాల్లో డబ్బుతో- పేరుతో పని లేదు- బలమైన భావజాలం ఉంటే చాలని అన్నారు. మార్పుకోసం వచ్చిన పార్టీ జనసేనా అని తెలంగాణ పోరాట స్ఫూర్తి నన్ను ఇవ్వాళ ఇక్కడి వరకు తెచ్చిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్