Sunday, September 22, 2024
HomeTrending Newsవేదిత దంపతులకు జగన్ ఆశీస్సులు

వేదిత దంపతులకు జగన్ ఆశీస్సులు

CM Jagan Attended The Marriage Reception Of Mla Daughter :

పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు.  శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగిన వేడుకలో వధువు రెడ్డి వేదిత (ఐఏఎస్‌), వరుడు రుచిత్‌ రల్లిలను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. వేదిత 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.  పశ్చిమ బెంగాల్ కేడర్ అధికారిగా అండమాన్ నికోబార్ దీవుల్లో రెవిన్యూ శాఖలో డిప్యూటీ కమిషనర్ గా ఆమె పనిచేస్తున్నారు.

రెడ్డి శాంతి 2019 ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు 2014 లో శ్రీకాకుళం లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

వివాహ రిసెప్షన్ కు హాజరైన అనంతరం ఓడిశా సిఎంతో చర్చల కోసం సిఎం జగన్ భువనేశ్వర్ బయల్దేరి వెళ్ళారు.

Must Read :  వైషమ్యాలకు విపక్షం యత్నం: సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్