Friday, October 18, 2024
HomeTrending Newsకాంగ్రెస్ చలో రాజ్ భవన్ ఉద్రిక్తం

కాంగ్రెస్ చలో రాజ్ భవన్ ఉద్రిక్తం

Congress Chalo Rajbhavan :  రాహుల్‌ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. తెలంగాణ మ‌హిళా కాంగ్రెస్ నేత‌లు రాజ్ భవన్ ముట్టడికి ప్ర‌య‌త్నించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు నేతృత్వంలో రాజ్ భవన్ ముట్టడి యత్నం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుస‌రిస్తోన్న తీరుకి వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ముట్టడి కార్యక్రమంలో కొందరు నేతలు దురుసుగా వ్యవహరించడాన్నిపోలీసు శాఖ సీరియస్ గా తీసుకొంది. పోలీసులపై కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరుపై పోలీస్ శాఖ కేసులు పెట్టే అవకాశం ఉందని సమాచారం.

న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి వచ్చిన  పోలీసులు తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై పోలీసులు దాడి చేశారని ఎఐసీసీ నేత రణదీప్ సూర్జేవాలా చెప్పారు.  ఈ ఘటనను నిరసిస్తూ గురువారం దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకొంది.  ఇవాళ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని టీపీసీసీ సీరియస్ గా తీసుకుంది.  కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అయినా కూడా పోలీసుల భద్రతను చేధించుకొని కాంగ్రెస్ నేతలు కొందరు రాజ్ భవన్ వద్దకు చేరుకున్నారు.

ఖైరతాబాద్ జంక్షన్ వద్ద  బైక్ కు కాంగ్రెస్ కార్యకర్తలు ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టారు. ఆర్ టి సి బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. బస్సుపై నిలబడి ఆందోళన చేశారు.  పోలీసుల అత్యుత్సాహం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు.  రాజ్ భవన్ పైపునకు వెళ్తునన CLP నేత మల్లు భట్టి విక్రమార్కను డీసీపీ జోయాల్ డవిస్ నేతృత్వంలో పోలీసులు అడ్డుకున్నారు. డీసీపీతో మల్లు బట్టి విక్రమార్క వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో డీసీపీ జోయల్ డేవిస్ ను భట్టి విక్రమార్క వెనక్కి నెట్టివేశారు.

రాజ్ భవన్ వైపునకు వెళ్తున్న మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరిని పోలీసులు అనుసరించారు. డోంట్ టచ్ మీ అంటూ రేణుకా చౌదరి పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను రాజ్ భవన్ లోకి వెళ్తే యాక్షన్ తీసుకోవాలన్నారు. తాను కట్టిన పన్నులతో వేసిన రోడ్డుపై నడిస్తే మీకేం అభ్యంతరమని రేణుకా చౌదరి పోలీసులను ప్రశ్నించారు. ఓ మహిళా కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో  ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ విషయాన్ని గమనించిన రేణుకా చౌదరి పోలీసుల తీరుపై మండిపడ్డారు.  తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన మహిళా పోలీసులను నెట్టివేశారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. అదే సమయంలో అక్కడే ఉన్న పంజాగుట్ట ఎస్ ఐ రేణుకా చౌదరికి అడ్డుపడే ప్రయత్నం చేయడంతో రేణుకా చౌదరి ఎస్ఐ చొక్కా పట్టుకొని నిలదీశారు. ఈ పరిణామంతో అక్కడే ఉన్న మహిళా పోలీసులు కూడా షాక్ తిన్నారు. వెంటనే ఓ మహిళా పోలీస్ రేణుకా చౌదరి చేయిని పంజాగుట్ట ఎస్ఐ చొక్కా నుండి లాగివేశారు. రాజ్ భవన్ వైపునకు వెళ్తున్న రేణుకా చౌదరిని మహిళా పోలీసులు చుట్టుముట్టి పోలీస్ వాహనం వద్దకు తీసుకెళ్లారు.

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి పోలీసు అధికారులపై వ్యవహరించిన తీరుపై పోలీసు శాఖ సీరియస్ గా తీసుకొంది.ఈ విషయమై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించే సమయంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.జగ్గారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క,రేణుకా చౌదరిని పోలీసులు గోషామహల్ స్టేడియానాకి తరలించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

భారీగా ట్రాఫిక్ జామ్

రాజ్ భవన్ వైపునకు వెళ్లేందుకు ఖైరతాబాద్ జంక్షన్ వద్ద కాంగ్రెస్ ఆందోళన చేసింది. దీంతో ఖైరతాబాద్-పంజాగుట్ట మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.  బేగంపేట వైపు కూడా రోడ్డుపైనే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్