Sunday, March 8, 2026
HomeTrending Newsకర్ణాటక గవర్నర్ గా తావర్ చంద్ గెహ్లాట్

కర్ణాటక గవర్నర్ గా తావర్ చంద్ గెహ్లాట్

రాజ్యసభలో సభాపక్ష నేత, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ కర్నాటక గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ వారంలో కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళన  ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రదేశ్ కు చెందిన గెహ్లాట్ భారతీయ జనతా పార్టీలో, కేంద్ర ప్రభుత్వాల్లో పలు హోదాల్లో పనిచేశారు.

8 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ నిర్ణయం తీసుకున్నారు,  ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది.

  • గోవా గవర్నర్ గా ప్రస్తుత మిజోరాం గవర్నర్ గా ఉన్న శ్రీధరన్ పిళ్ళై
  • త్రిపుర గవర్నర్ గా ప్రస్తుత హర్యానా గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య
  • హర్యానా గవర్నర్ గా ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ
  • జార్ఖండ్ గవర్నర్ గా ప్రస్తుత త్రిపుర గవర్నర్ రమేష్ బయాస్
  • మిజోరాం గవర్నర్ గా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కంభంపాటి హరిబాబు
  • కర్నాటక గవర్నర్ గా తావర్ చంద్ గెహ్లాట్
  • మధ్య ప్రదేశ్ గవర్నర్ గా మంగు భాయి ఛగన్ భాయి పటేల్
  • హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ లను నియమిస్తూ రాష్ట్ర పతి నిర్ణయం తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular