Sunday, September 22, 2024
HomeTrending Newsకవ్వాల్ టైగర్ రిజర్వ్ లో గ్రామాల తరలింపు ప్రారంభం

కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో గ్రామాల తరలింపు ప్రారంభం

కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో గ్రామాల తరలింపు ప్రక్రియ ప్రారంభం అయింది. స్వచ్చందంగా ముందుకు వచ్చిన మైసంపేట, రాంపూర్ వాసులు. నిర్మల్ జిల్లా కడెం మండలం కేంద్రంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిహార చెక్కులు, ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూముల పట్టాల పంపిణీ చేశారు. రెండు గ్రామాలకు చెందిన 142 కుటుంబాలకు 15 లక్షల రూపాయల చొప్పున పరిహార ప్యాకేజీ అందచేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్, భైంసా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, అటవీశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వ‌న్య‌ప్రాణుల చ‌ట్టం -1972, పులుల సంరక్షణ అథారిటీ (NTCA)  మార్గ‌ద‌ర్శ‌కాల‌ ప్ర‌కారం తరలింపు ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు, తెలంగాణ చరిత్రలో మొదటిసారి పులుల అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియ జరుగుతోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. పులులు- వన్యప్రాణుల సంరక్షణ, ఆవాసాల అభివృద్దికి తెలంగాణ అటవీశాఖ ప్రాధాన్యత ఇస్తోందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : పర్యాటకుల కోసం కవ్వాల్ వెబ్ సైట్  

RELATED ARTICLES

Most Popular

న్యూస్