Saturday, March 14, 2026
Homeసినిమా‘మా’ ఎన్నికలపై వెంకీ వేదాంతం

‘మా’ ఎన్నికలపై వెంకీ వేదాంతం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్టు ప్రకటించడం.. ఆరత్వాత తన ప్యానెల్ ప్రకటించడం తెలిసిందే. ఆతర్వాత మంచు విష్ణు, జీవిత, హేమ, సివిఎల్ నరసింహారావు కూడా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆతర్వాత ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనేది తెర పైకి వచ్చింది. ఆతర్వాత మంచు విష్ణు మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం అంటూ పిలుపునిచ్చారు. ఇటీవల మా భవనాన్ని తనే నిర్మిస్తానని ప్రకటించారు. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ మా ఎన్నికల గురించి స్పందిస్తూ.. విష్ణుకు సపోర్ట్ గా మాట్లాడారు. అందరూ కలిస్తే ఇంద్రభవనమే కట్టచ్చు అన్నారు.

మా స‌భ్యులు ఫండ్ రైజింగ్ కోసం అమెరికాలో కొన్ని కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అప్పుడు బిజినెస్ క్లాసు టికెట్ల ఏసుకుని తిరిగారు. ఆ ఫండ్ డ‌బ్బులు ఏమయ్యాయ‌ని బాలయ్య ప్ర‌శ్నించారు. బాలయ్య మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. నారప్ప సినిమా ఈ నెల 20న ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన వెంకటేష్ ని మా ఎన్నికల గురించి అడిగితే..  ఏదీ మన చేతుల్లో లేదు. ఏదైనా జరగొచ్చు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఎలక్షన్ల నేపథ్యంలో జరిగే విమర్శలు, మాటల తూటాలు శాశ్వతం కాదు అని సమాధానమిచ్చారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular