Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్IPL: ముంబైపై గుజరాత్ విజయం

IPL: ముంబైపై గుజరాత్ విజయం

ముంబై ఇండియన్స్ మరోసారి పేలవ ప్రదర్శనతో ఓటమి పాలైంది. నేడు జరిగిన మ్యాచ్ లో గుజరాత్  టైటాన్స్ తో 55 పరుగుల తేడాతో ముంబైపై విజయం సాధించింది. గుజరాత్ ఇచ్చిన 208 పరుగుల లక్ష్య సాధనలో  ముంబై 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులే చేసింది.  ఆహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.  గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (4) జట్టు స్కోరు 12 వద్ద ఔటయ్యాడు.  హార్దిక్ పాండ్యా-13; విజయ్ శంకర్-19రన్స్ చేసి వెనుదిరిగారు.  శుభ్ మన్ గిల్ 34 బంతుల్లో 7 ఫోర్లు,  1 సిక్సర్ తో 56; డేవిడ్ మిల్లర్  22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 46; అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42; రాహూట్ తెవాటియా 5 బంతుల్లో 3 సిక్సర్లతో  20… ధాటిగా ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి  207 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా 2; అర్జున్ టెండూల్కర్, బెహెండ్రాఫ్, మెరెడిత్, కుమార్ కార్తికేయ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ  (2); ఇషాన్ కిషన్ (13) మరోసారి విఫలమయ్యారు.  నేహాల్ వధేరా-40; కామెరూన్ గ్రీన్-33; సూర్య కుమార్ యాదవ్-23; చావ్లా-18 పరుగులతో ఫర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3;  రషీద్ ఖాన్, మోహిత్ శర్మ చెరో 2; హార్దిక్ పాండ్యా ఒక వికెట్ సాధించారు.

అభినవ్ మనోహర్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్