Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్IPL: గుజరాత్ దూకుడు- గుర్జాబ్ మెరుపు ఇన్నింగ్స్ వృథా

IPL: గుజరాత్ దూకుడు- గుర్జాబ్ మెరుపు ఇన్నింగ్స్ వృథా

గుజరాత్ టైటాన్స్ మరోసారి సత్తా చాటింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో నేడు జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కోల్ కతా ఓపెనర్ రహమతుల్లా గుర్జాబ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 39బంతుల్లో  5 ఫోర్లు, 7 సిక్సర్లతో 81 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ జగదీషన్-19; రింకూ సింగ్ (19) రన్స్ చేశారు. వెంకటేష్ అయ్యర్ (11), కెప్టెన్ నితీష్ రానా (4), శార్దూల్ ఠాకూర్ (0) విఫలమయ్యారు. చివర్లో ఆండ్రీ రస్సెల్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు సాధించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో షమీ 3; జోష్ లిటిల్, నూర్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

గుజరాత్ తొలి వికెట్ (వృద్ధిమాన్ సాహా-10) కు 41 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ 20 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ తో 26 పరుగులు చేసిన రెండో వికెట్ గా; శుభ్ మన్ గిల్ 35 బంతుల్లో 8 ఫోర్లతో 49 రన్స్ చేసి మూడో వికెట్ గా వెనుదిరిగారు. ఆ తర్వాత విజయ్ శంకర్-51 (24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు); డేవిడ్ మిల్లర్-32 (18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో అజేయంగా నిలిచి 17.5 ఓవర్లలోనే విజయం అందించారు.

కోల్ కతా బౌలర్లలో హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ తలా ఒక వికెట్ సాధించారు.

ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన జోష్ లిటిల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్