Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్The Ashes: మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం

The Ashes: మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం

యాషెస్ సిరీస్  మూడో టెస్టులో ఇంగ్లాండ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదు మ్యాచ్ ల సిరీస్ 2-1 చేసి రేసులో నిలిచింది. లీడ్స్ లోని హెడింగ్లే మైదానంలో జరిగిన ఈ టెస్టులో 251  లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ నిన్న మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 27 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.

హ్యారీ బ్రూక్ 75 పరుగులతో సత్తా చాటాడు, జాక్ క్రాలే-44; బెన్ డకెట్-23; జో రూట్-21 రన్స్ చేసి ఔటయ్యారు. మోయిన్  అలీ(5), బెయిర్ స్టో (5) విఫలం కాగా, కెప్టెన్ స్టోక్స్ 13 పరుగులే చేశాడు. 171 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన దశలో బ్రూక్- క్రిస్ ఓక్స్ లు ఏడో వికెట్ కు 59 పరుగులు జత చేసి జట్టును విజయం వైపు నడిపించారు. ఓక్స్ -32…. బ్రూక్ ఔటైన తరువాత వచ్చిన మార్క్ వుడ్ 8  బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 16 పరుగులతో నాటౌట్ గా నిలిచి గెలిపించారు.

ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 5; కమ్మిన్స్, మార్ష్ చెరో వికెట్ పడగొట్టారు.

రెండు ఇన్నింగ్స్ లో కలిపి ఏడు వికెట్లు తీసిన మార్క్ వుడ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్