Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్Japan Open: క్వార్టర్స్ కు సేన్, ప్రణయ్

Japan Open: క్వార్టర్స్ కు సేన్, ప్రణయ్

భారత స్టార్ ప్లేయర్ లు లక్ష్య సేన్, హెచ్ ఎస్ ప్రణయ్, సత్విక్-చిరాగ్ జోడీలు జపాన్ ఓపెన్-2023లో క్వార్టర్ ఫైనల్స్ కు ప్రవేశించారు. నేడు జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్ ల్లో…

లక్ష్య సేన్ 21-14; 21-16 తో జపాన్ ప్లేయర్ కంటా సునేయనపై

హెచ్ ఎస్ ప్రణయ్ 19-21; 21-9; 21-9 తేడాతో మన దేశానికే చెందిన కిడాంబి శ్రీకాంత్ పై గెలుపొందారు.

పురుషుల డబుల్స్ మ్యాచ్ లో సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ.. డెన్మార్క్ ద్వయం జీపీ బే- లస్సీ మోల్హేదే పై 21-17; 21-11 తేడాతో విజయం సొంతం చేసుకున్నారు.

కాగా, మహిళల డబుల్స్ మ్యాచ్ లో గాయత్రి గోపీ చంద్- త్రెసా జాలీ ఓటమి పాలయ్యారు. వీరిపై జపాన్ జోడీ నామి మత్సుయమ-చిహారు సుడ 23-21; 21-19తో గెలుపొందారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్