మణిపూర్ ఘర్షణల దర్యాప్తు పర్యవేక్షణకు ముగ్గురు మాజీ మహిళా న్యాయమూర్తుల కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మణిపూర్ హింసా సంఘటనలపై దరగయాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), మణిపూర్ పోలీసుల దర్యాప్తును పరిశీలించేందుకు జమ్మూ & కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన మహిళా న్యాయ కమిటీని సుప్రీంకోర్టు సోమవారం ఏర్పాటు చేసింది
ఈ కమిటీలో సభ్యులుగా మాజీ న్యాయమూర్తులు శాలినీ జోషి మరియు ఆశా మీనన్లు ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది.