Sunday, May 19, 2024
Homeసినిమా‘వరుడు కావలెను’ ప్రేమగీతం విడుదల

‘వరుడు కావలెను’ ప్రేమగీతం విడుదల

నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘. ఈ చిత్రం ద్వారా ‘లక్ష్మీ సౌజన్య’ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంట్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన మధురమైన సాహిత్యానికి గాయని చిన్మయి ఆలపించిన సుమధురమైన గీతం నేడు విడుదలైంది. ఈ పాత వింటుంటే.. సంగీత, సాహిత్యాల కలబోత అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే….

‘‘మనసులోనే నిలిచి పోకె మైమరపుల మధురిమ
పెదవిదాటి వెలికిరాక బెదురెందుకె హృదయమా
ఎన్నినాళ్ళిలా ఈ దోబూచుల సంశయం
అన్నివైపుల వెనుతరిమే ఈ సంబరం”

ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ స్వరాలు ప్రాణం పోశాయి. చిత్ర నాయకా నాయికలు మధ్య ప్రేమకు తెర రూపంగా  ఈ గీతం కనిపిస్తుంది. సంగీతం, సాహిత్యం, స్వరం ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది. వీటికి తోడు నాగశౌర్య, రీతువర్మల అభినయం కట్టిపడేస్తుంది. శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. నాయిక మనోభావాలకు అద్దంపడుతుందీ గీతం.

ప్రఖ్యాత రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యానికి చిన్మయి గారు ఆలపించిన ఈ గీతం మీకు కూడా నచ్చుతుంది. ప్రేక్షకులకు,సంగీత ప్రియులకు చాలాకాలంపాటు గుర్తుండిపోయే పాటగా వారి హదయాలలో నిలిచి పోతుందని ఆశిస్తున్నాను అన్నారు చిత్ర సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్. ప్రస్తుతం చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘వరుడు కావలెను‘ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథానుగుణంగా సాగి  అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం  చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్