Friday, April 19, 2024
Homeసినిమా'హనుమాన్' రాకతో మళ్లీ వార్తల్లో నిలిచిన 'ఆదిపురుష్‌'

‘హనుమాన్’ రాకతో మళ్లీ వార్తల్లో నిలిచిన ‘ఆదిపురుష్‌’

ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ చిత్రం రామాయణం ఆధారంగా రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ రాముడుగా నటిస్తుంటే.. సీతగా కృతి సనన్ నటిస్తుంది. సైఫ్‌ ఆలీఖాన్ రావణుడుగా నటిస్తున్నారు. ఆమధ్య ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ విజువల్ వండర్ లా ఉందనే రెస్పాన్స్ కన్నా.. బొమ్మల సినిమాలా ఉంది.. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయనే కామెంట్లే ఎక్కువ వచ్చాయి. అప్పటి నుంచి ఆదిపురుష్ మేకర్స్ మరోసారి గ్రాఫిక్స్ వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాయి.

సోషల్ మీడియాలో ఆదిపురుష్ పై ట్రోల్స్ చేయడంతో మేకర్స్ ఆలోచనలో పడ్డారు. ఆఖరికి ఆదిపురుష్ రిలీజ్ డేట్ కూడా మార్చాయి. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ ను మళ్లీ కొత్తగా చేస్తున్నారు. ఇవ్వాళ, రేపు సినిమా ఎలా వుంటుంది అన్నది కాదు పాయింట్. ఫస్ట్ లుక్, టీజర్ ఎలా వచ్చింది అన్నది కీలకం. టీజర్ ను బట్టే సినిమా లెవెల్ ను అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. లేటెస్ట్ గా ‘హనుమాన్’ టీజర్ రిలీజ్ చేశారు. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది.

అయితే.. ఆదిపురుష్ గాయాన్ని హనుమాన్ టీజర్ మళ్లీ మరోసారి కెలికింది. హనుమాన్ టీజర్ క్వాలిటీ చూసి, జనాలు మరోసారి ఆదిపురుష్ టీజర్ ను ఆడుకోవడం మొదలుపెట్టారు. హనుమాన్ టీజర్ లో సినిమా ఎలా వుండబోతొంది అన్న క్లారిటీతో పాటు, విజువల్స్ కూడా ఆకట్టుకునేలా చేసారు. మిడియం బడ్జెట్ తో ఇంత క్వాలిటీగా ఎలా చేశారంటూ ప్రశాంత్ వర్మను అభినందిస్తున్నారు. అసలే ఇప్పుడు భక్తి సినిమాల ట్రెండ్ నడుస్తోంది. రామ్.. రామ్ అంటూ రామనామజపం, హనుమంతుడి మీద తీసిన డివోషనల్ ఫాంటసీ కావడంతో యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. ఖచ్చితంగా సక్సస్ అవుతుందనే టాక్ వచ్చేసింది. మరి.. హనుమాన్ రిలీజ్ తర్వాత ఆదిపురుష్ పై మరింత ఒత్తిడి పెరుగుతాదేమో చూడాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్