Thursday, March 28, 2024
Homeసినిమా‘అలిపిరికి అల్లంత దూరంలో..’ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా

‘అలిపిరికి అల్లంత దూరంలో..’ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా

కాస్కేడ్ పిక్చర్స్ పతాకం పై నూతన నటుడు రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మించిన చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నూతన నటీనటులతో నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషించారు. యూనిక్ రాబరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘మా తిరుపతి’ పాట సెన్సేషనల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ప్రమోషనల్ మెటీరియల్ మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం నవంబర్ 18న థియేటర్లో విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో యూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ గారికి సంతాపం తెలుపుతూ చిత్ర బృందం నివాళులు అర్పించింది.

హీరో రావణ్ నిట్టూరు మాట్లాడుతూ.. ‘అలిపిరికి అల్లంత దూరంలో’ నా మొదటి సినిమా. ఇంత మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా అనందంగా వుంది. ఇంత మంచి స్క్రిప్ట్ లో నన్ను భాగం చేసిన దర్శకుడు ఆనంద్ కి కృతజ్ఞతలు. అలాగే నన్ను సపోర్ట్ చేసిన నిర్మాతలకు కృతజ్ఞతలు. నటీనటులంతా కొత్తవాళ్ళమే. అయితే మంచి కథ, దానిని సరిగ్గా హ్యాండిల్ చేసే ఆనంద్ లాంటి దర్శకుడు వున్నప్పుడు కొత్తవాళ్ళతో కూడా మంచి సినిమా తీయొచ్చని ఈ సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. నవంబర్ 18న థియేటర్లో విడుదలౌతుంది. కథ విన్నప్పుడు ఎంత నమ్మకంగా వున్నానో సినిమా చూసిన తర్వాత ఆ నమ్మకం డబులైయింది. తప్పకుండా సినిమా మీ అందరినీ అలరిస్తుంది. అందరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలి అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్