Thursday, April 25, 2024
Homeసినిమాఇది మన ఇంట్లో జరిగే కథే : ర‌ష్మిక‌

ఇది మన ఇంట్లో జరిగే కథే : ర‌ష్మిక‌

AMJ-enjoy:  శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు‘. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈనెల 4న శుక్రవారం నాడు విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక‌ గురువారం హైదరాబాద్లోని స్టార్ హోటల్లో ఘనంగా జరిగింది.

ఈ వేడుక‌లో దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ.. పాండమిక్ ముందు యాక్షన్, మాస్, యూత్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ కథలూ వచ్చాయి. అన్నీ సక్సెస్ అయ్యాయి. పాండమిక్ తర్వాత పిల్లలతో చూసే సినిమాను మిస్ అయ్యాం. ఆ వాతావరణాన్ని మా సినిమా వంద శాతం ఇస్తుందని నమ్ముతున్నా. థియేటర్లు ఫ్యామిలీలతో కళకళలాడాలని కోరుకుంటున్నాను. ఈమధ్యనే పెద్దమ్మ గుడిలో కుంకుమార్చనకు వెళితే అక్కడ ఇతర కుటుంబాల మహిళలు తమ సభ్యుల పేర్లు చెబుతుంటే అవన్నీ మా సినిమాలోని పేర్లుగా అనిపించాయి.

కనుక ఈ సినిమాకు అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో లవ్ స్టోరీ కూడా వుంది. ఇంతకు ముందు నేను చేసిన ‘ఉన్నది ఒక్కటే జిందగి’ సినిమాను చూసి యూత్ చాలామంది తమను తాము చూసుకున్నామని చెప్పారు. ‘నేను శైలజ’ ఫాదర్, డాటర్ రిలేషన్స్ పై తీశాను. అందులో చెప్పినట్లుగా నా స్నేహితుడు కనెక్ట్ అయి పెద్దగా మాటలు లేని అతను తప్పు తెలుసుకుని నన్ను పలుకరించాడు. ఇందులో అన్నీ సీన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ సీన్ కు మహిళలు చప్పట్లు కొడతారని గట్టిగా చెప్పగలను” అని  విశ్వాసం వెలిబుచ్చారు.

రష్మిక మందన్న మాట్లాడుతూ “చాలా కాలం తర్వాత ఫ్యామిలీ సినిమా చేశాం. థియేటర్ కి వచ్చి చూడండి. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలోని పాత్రలు మన ఇంటిలో అమ్మ, చెల్లి ఎలా మాట్లాడతారో అలానే వుంటాయి. కొన్ని సంఘటనలు మన ఇంటిలో జరిగేవిగా కనిపిస్తాయి. మా ఇంటిలో కూడా అమ్మ, నాన్న, చెల్లి ఈ సినిమా విడుదల రోజు తొలి ఆట చూస్తానన్నారు. మీరు కుటుంబంతో ఎంజాయ్ చేయండి అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్