Sunday, May 19, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్రెండు రాష్ట్రాలు బాగుండాలి

రెండు రాష్ట్రాలు బాగుండాలి

సాగునీటిపై హక్కుపై మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 1994-2004 వరకు అధికారంలొ ఉన్న టిడిపి  ఏ ప్రాజెక్టు చేపట్టకపొవడం వల్ల బ్రిజేష్ కూమార్ ట్రిబ్యూనల్ లొ ఏపికి చాలా అన్యాయం జరిగిందని ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలనేదే తమ ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశ్యమని అయన పేర్కొన్నారు.

శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలోని ముఖ్యంశాలు:

  • వ్యవసాయం దండగని డైరీలొ రాసుకుని సీమ వాసులను గుండెకొతకు గురిచేశాడు
  • నిధులు ఇవ్వకుండా శంకుస్దాపనలు చేసిన ఘనత బాబుది…
  • గండికొట సామర్ద్యం తగ్గించి శంకుస్దాపన చేశారు
  • కృష్ణా జలాలపై ఉన్న హక్కు కొల్పొయేలా చేశారు
  • మిగులు జలాలు వాడుకుంటామని వైఎస్ ప్రాజెక్టులు చేపట్టడం వల్ల కొన్ని కేటాయింపులైనా వచ్చాయి
  • మళ్లీ అధికారంలొకి వచ్చి ప్రాజెక్టులు అపేశారు..
  • సాగునీటిపై అవగాహన, చిత్తశుద్ది లేని వ్యక్తి చంద్రబాబు
  • కుళ్లు, కుతంత్రాలు ఒంటబట్టించుకున్న వ్యక్తి చంద్రబాబు…
  • శ్రీశైలంలొ కనీస నీటిమట్టం మెయిన్ టైన్ చేయాలన్నా చంద్రబాబు పట్టించుకొలేదు
  • సీమ ప్రాజెక్టుల పట్ల వైఎస్అర్ అశయాన్ని జగన్  కొనసాగిస్తున్నారు
  • వైఎస్అర్, జగన్ వల్లే సీమ ఎత్తిపొతల పథకం బ్రతికి ఉంది
  • బాబు, పవన్ ఇద్దరు అప్పడప్పుడు వచ్చి మాట్లాడి వెళ్లే వారే
  • హైదరాబాద్ లొ ఉంటూ భయపడి ఏపి సాగునీటిని తాకట్టు పెట్టారు
  • శ్రీశైలంలొ కనీస నీటిమట్టం రాకముందే తెలంగాణా ప్రభుత్వం దిగువకు వదిలుతుంది
  • 800 అడుగులు రాకముందే విద్యుత్ ఉత్పత్తి చేశారు
  • సీమ ప్రాజెక్టుల కొసం ఎంత వరకైనా పోరాడతాం
  • సీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను గెజిట్ లొ పొందుపరిచే వరకు పోరాడతాం
  • రాజకీయాలు చేయకుండా బాబు సహకరించాలి…
  • మైసూరారెడ్డి ఎవరి అజెండానొ మనస్సులొ పెట్టుకుని మాట్లాడుతున్నారు…
  • తెలంగాణా వ్యతిరేకించే అంశాలను మైసూరారెడ్డి సమర్ధిస్తున్నారు
  • ఇరు రాష్టాలు బాగుండాలని సిఎం జగన్ కొరుకుంటున్నారు
  • కానీ తెలంగాణా ప్రభుత్వం సహకరించడం లేదు
  • తెలంగాణా రైతులు నష్టపొవాలని ఏపి ప్రభుత్వం కోరుకొవడం లేదు
RELATED ARTICLES

Most Popular

న్యూస్