Thursday, June 11, 2026
HomeTrending Newsకందుకూరు, గుంటూరు ఘటనలపై న్యాయ విచారణ

కందుకూరు, గుంటూరు ఘటనలపై న్యాయ విచారణ

కందుకూరు, గుంటూరు ఘటనలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం దీనిపై జ్యూడిషియల్ ఎంక్వైరికి ఆదేశించింది. నెలరోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గత నెల డిసెంబర్ 28 న నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్ షో నిర్వహించారు.  చంద్రబాబు తన వాహనం నుండి ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో మొత్తం 8 మంది మరణించారు.

ఈ ఘటన జరిగిన మూడు రోజులకే జనవరి 1న గుంటూరు వికాస్ నగర్ లో టిడిపి ఎన్ ఆర్ ఐ విభాగం=ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన చంద్రన్న కానుక- జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు ఈ సభలో పాల్గొని ప్రసంగించి వెళ్ళిపోయిన అనంతరం చీరల కోసం ఒక్కసారిగా అక్కడకు వచ్చిన మహిళలు ఎగబడడంతో తొక్కిసలాట జరిగి మొత్తం ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు. ఈ రెండు సంఘటనల తర్వాత ప్రభుత్వం జీవో నంబర్ 1 ను తీసుకు వచ్చింది. రోడ్ల పై బహిరంగ సభలు పెట్టుకోవడాన్ని నిషేధించింది. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాయి.

ఈ సందర్భంలోనే ప్రభుత్వం కందుకూరు, గుంటూరు ఘటనలపై  రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషశయన రెడ్డితో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది.  తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులు, బాధ్యుల పై విచారణ చేయనున్న కమిషన్.. నెలరోజుల్లో ఓ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular