Saturday, March 29, 2025
Homeస్పోర్ట్స్సెమీ ఫైనల్లో ఓడిన బజరంగ్ పునియా

సెమీ ఫైనల్లో ఓడిన బజరంగ్ పునియా

టోక్యో ఒలింపిక్స్ 57 కిలోల రెజ్లింగ్ లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాడు. క్వార్టర్  ఫైనల్ మ్యాచ్ లో ఇరాన్ కు చెందిన మోర్తెజాపై 2-1 తేడాతో విజయం సాధించిన పునియా సెమీస్ లో అజెర్ బైజాన్ దేశానికి చెందినా హాజీ అలియెవ్ చేతిలో 12-5తేడాతో ఓటమి పాలయ్యాడు.  అంతకుముందు జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో కజకిస్తాన్ కు  ఎర్నజర్ అక్మటాలెవ్ తో 3-3 స్కోరు సాధించినా ‘విక్టరీ బై పాయింట్స్’ ప్రకారం పునియా విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు.  కానీ ఈ పోరాట పటిమను సెమీఫైనల్లో కొనసాగించలేకపోయాడు.  పునియా శనివారం కాంస్యపతకం కోసం పోరాడనున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్