Sunday, March 8, 2026
Homeజాతీయంపిలిచి అవమానించారు : మమత

పిలిచి అవమానించారు : మమత

కరోనాపై వీడియో కాన్ఫరెన్స్ కు పిలిచి అవమానించారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విమర్శించారు. ప్రధాని మోడీ నేడు 10 రాష్ట్రాలకు చెందిన 54 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము చెప్పేది వినడానికి ప్రధాని సిద్ధంగా ఉన్నట్లు కనబడలేదని, వాక్సిన్ విషయంలో కూడా తమ అభిప్రాయాలు తీసుకోలేదని, బిజెపి సిఎంకు మాత్రమే మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని ఆరోపించారు. మోడీ ఈ సమావేశానికి ఇలా వచ్చి అలా వెళ్ళారని, అధికారుల మాటే గాని ముఖ్యమంత్రుల మాట వినరా అంటూ ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular