Friday, March 6, 2026
HomeTrending NewsTTD Chairman: సామాన్య భక్తులే నా తాత్వికత: భూమన

TTD Chairman: సామాన్య భక్తులే నా తాత్వికత: భూమన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలకమండలి అధ్యక్షుడిగా రెండో సారి ఎన్నిక కావడం సంతోషంగా ఉందని టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శ్రీవారి ఆలయంలోని గరుడ ఆల్వార్ సన్నిధిలో టిటిడి ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత అన్నమయ్య భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.  కండలు కరిగించుకొని, నెత్తురును స్వేదంగా చిందించి కష్టపడి సంపాదించిన సొమ్ములో కొంతభాగం తిరుమల శ్రీవారికి కానుకలు సమర్పించి త్రుటి కాలపు దర్శనం కోసం తాపత్రయ పడే సామాన్య భక్తులే తన తాత్వికత అని వెల్లడించాడు.  ధనవంతులకు ఊడిగం చేయడానికో, వారికి ప్రథమ తాంబూలం ఇవ్వడానికో తానూ ఈ పదవి చేపట్టలేదని శపథం చేశారు. గతంలో పాలక మండలి అధ్యక్షుడిగా కూడా సామాన్యులకే పెద్ద పీట వేశానని గుర్తు చేశారు.

అంతకుముందు తిరుపతి శ్రీ తాతాయగుంట గంగమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. టిటిడి జేఈఓ ఏవి ధర్మారెడ్డి..  స్వామి వారి లడ్డు ప్రసాదాలను అందించారు. ఆ తర్వాతా అలిపిరి గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం తీసుకొని తిరుమల కొండపైకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular