Friday, September 20, 2024
HomeTrending Newsఢిల్లీ గద్దె సుస్థిరం చేసే దిశగా బిజెపి మేనిఫెస్టో

ఢిల్లీ గద్దె సుస్థిరం చేసే దిశగా బిజెపి మేనిఫెస్టో

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి తమ మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌ లు మేనిఫెస్టో ను విడుదల చేశారు. మోడీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్‌ థీమ్‌తో రూపొందించారు.

ఒకే దేశం, ఒకే ఎన్నిక అమలు, ఉమ్మడి ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం, UCC (యూనిఫాం సివిల్ కోడ్) అమలుకు కట్టుబడి ఉన్నట్టు మేనిఫెస్టోలో ప్రకటించారు.

మేనిఫెస్టోలోని కీలక అంశాలు..

70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం
మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం
మరో ఐదేళ్లు ఉచిత రేషన్‌
పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికీ వంటగ్యాస్‌
ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు
దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం
ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆయుష్మాన్‌ భారత్‌
వృద్ధుల కోసం ఆయుష్‌ శిబిరాల నిర్వహణ
పుణ్యక్షేత్రాల పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో వృద్ధులకు చేయూత
మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళిక
పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన ద్వారా ఉచిత విద్యుత్తు
డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు
కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ కోసం ప్రత్యేక క్లస్టర్లు
ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం
చిన్నరైతుల లబ్ధి కోసం శ్రీఅన్న సాగు ప్రోత్సాహం
వ్యవసాయ మౌలికవసతుల మిషన్‌ ప్రారంభం
వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రత్యేక ఉపగ్రహం
సేవారంగంతో స్వయం సహాయక సంఘాల అనుసంధానం
ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువర్‌ సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటు
తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి
ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే కొత్త శాటిలైట్‌ పట్టణాల ఏర్పాటు
విమానయాన రంగానికి ఊతం
విద్యుత్తు వాహన రంగానికి ప్రోత్సాహం
వందేభారత్‌ విస్తరణ
దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోనూ బుల్లెట్‌ రైలు
రక్షణ, వంటనూనె, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి
గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగానికి ప్రోత్సాహం
గ్రీన్‌ ఎనర్జీ, ఫార్మా, సెమీ కండక్టర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్నోవేషన్‌, లీగల్‌ ఇన్సూరెన్స్‌, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌ల ఏర్పాటు
అంతరిక్ష రంగంలో భారత సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళిక
విదేశాల్లో భారతీయుల భద్రతకు హామీ
ఉద్యోగ నియామకాల్లో పేపర్‌ లీకేజీల నివారణకు కఠిన చట్టం, పారదర్శకంగా నియామక ప్రక్రియ
అంకురాలకు నిధులు, మెంటార్‌షిప్‌తో మద్దతు

వికసిత్ భారత్‌కు నాలుగు స్తంభాలైన మహిళా శక్తి, యువశక్తి, రైతులు, పేదలపై మేనిఫెస్టో దృష్టి సారించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేనిఫెస్టో జీవితాలకు గౌరవమని, జీవన నాణ్యత అని మోదీ వ్యాఖ్యానించారు.

2014 సంకల్ప పత్రమైనా, 2019లో ఇచ్చిన హామీలైనా ప్రతి ఒక్కదాన్ని నెరవేర్చామని చెప్పారు. ‘మోదీ కీ గ్యారంటీ’ 24 క్యారెట్ల అంత నాణ్యమైనదని పార్టీ అగ్రనేత, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.

బిజెపి అగ్రవర్ణాల పార్టీ కాదని చెప్పేందుకు అంబేద్కర్ జయంతి రోజు పార్టీ మేనిఫెస్టో విడుదల చేయటం గమనార్హం. ఒకటి రెండు మినహా సత్యదూరమైన హామీలను బిజెపి ఇవ్వలేదని ఢిల్లీలో టాక్. విపక్షాల మధ్య అనైక్యత దృష్ట్యా తిరిగి అధికారం దక్కటం ఖాయమని బిజెపి భావిస్తోంది.

ఈ దఫా అధికారంలోకి వస్తే చరిత్రలో కనివిని ఎరుగని నిర్ణయాలు తీసుకుంటామని ప్రధానమంత్రి ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించారు. ఢిల్లీ గద్దెను మరో పదేళ్ళపాటు కాషాయ దళం పాలించే విధంగా వ్యూహరచన జరగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్