Saturday, July 27, 2024
Homeసినిమా'డబుల్ ఇస్మార్ట్' లో విలన్ గా స్టార్ హీరో..?

‘డబుల్ ఇస్మార్ట్’ లో విలన్ గా స్టార్ హీరో..?

రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. లైగర్ తర్వాత పూరి దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకున్నారు. ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సాధించాలని కసితో కథ రాశారు. పూరి చెప్పిన కథ విన్నవెంటనే రామ్ ఓకే చెప్పారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో డబుల్ ఇస్మార్ట్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్  ముంబాయిలో స్టార్ట్ చేశారు. ఇటీవల రామ్ మరి కొంత మంది ఫైటర్స్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు.

అయితే.. ఇందులో విలన్ పాత్రకు గాను బాలీవుడ్ స్టార్స్ ను కాంటాక్ట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ మూవీలో విలన్ గా నటించేది ఎవరు అనేది ఆసక్తిగా మారింది. అయితే… ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కన్ ఫర్మ్ అయ్యాడని.. ఇందులో విలన్ గా నటిస్తున్నాడని తెలిసింది. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి భారీ తారాగణంతో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం సంజయ్ దత్ ఏకంగా పది కోట్ల భారీ రెమ్యూనరేషన్ అడిగారని.. దీనికి పూరి, ఛార్మి ఓకే చెప్పారని తెలిసింది.

ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. పూరి, రామ్ ఇద్దరికీ మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ కాబట్టి డబుల్ ఇస్మార్ట్ మూవీకి భారీగా క్రేజ్ ఉంది. అందుకనే సంజయ్ దత్ 10 కోట్లు అడిగినా.. పూరి, ఛార్మి నో చెప్పకుండా వెంటనే ఓకే చెప్పారట. హీరోయిన్స్ ఎవరు అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. మొత్తానికి డబుల్ ఇస్మార్ట్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఈసారి పూరి డబుల్ ఇస్మార్ట్ మూవీతో  బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్