Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్Wimbledon: సెమీస్ కు బోపన్న జోడీ

Wimbledon: సెమీస్ కు బోపన్న జోడీ

వింబుల్డన్ లో భారత ప్లేయర్ రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ పురుషుల డబుల్స్ లో సెమీస్ ఫైనల్లో అడుగుపెట్టింది. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ ద్వయం గ్రీక్ స్పూర్ – స్టీవెన్స్ పై 6-7; 7-5; 6-2 తేడాతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన తొలి సెట్ కోల్పోయినా రెండో సెట్ లో తేరుకొని పైచేయి సాధించారు. మూడో సెట్ ఏకపక్షంగా సాగింది.

నేడు జరిగే సెమీస్ పోరులో బోపన్న- మాథ్యూ  జంట…. కూల్ హోప్ (నెదర్లండ్స్)-నీల్ కుప్సి (ఇంగ్లాండ్) తో తలపడనుంది.

పురుషుల సింగిల్స్ మ్యాచ్ లో స్పెయిన్ ఆటగాడు అల్కరాజ్ 7-6; 6-4;6-4 తేడాతో డెన్మార్క్ ప్లేయర్ హోల్గర్ రూనే పై విజయం సాధించి సెమీస్ కు చేరుకున్నాడు. మరో మ్యాచ్ లో రష్యా స్టార్ డానియెల్ మెద్వదేవ్ చెమటోడ్చి సెమీస్ లో అడుగు పెట్టగలిగాడు. అమెరికా ఆటగాడు క్రిస్టోఫర్ ఉబాంక్ తో జరిగిన పోరులో 6-4; 1-6;4-6; 7-6;6-1 తేడాతో గెలుపొందాడు. తొలి సెట్ గెల్చుకున్న మెద్వదేవ్ కు తర్వాతి రెండు సెట్లలో క్రిస్టోఫర్ చుక్కలు చూపించాడు.  నువ్వా-నేనా అన్నట్లు సాగిన నాలుగో సెట్ ను గెల్చుకొని రేసులో నిలిచిన మెద్వదేవ్ నిర్ణాయక చివరి సెట్ లో సత్తా చాటి గెలుపు సొంతం చేసుకున్నాడు.

మహిళల సింగిల్స్ లో డిపెండింగ్ ఛాంపియన్ ఎలీనా రిబకినా (కజకిస్థాన్) కు ఎదురుదెబ్బ తగిలింది. ట్యునీషియా స్టార్ జాబెర్ చేతిలో 7-6; 6-4; 6-1తేడాతో ఓటమి పాలైంది. తొలిసెట్ గెల్చుకున్న రిబకినా ఆ తర్వాత ప్రత్యర్థి కి తలవంచక తప్పలేదు.

మరో మ్యాచ్ లో బెలారస్ క్వీన్ సబలెంక 6-2;6-4 తేడాతో రెండు వరుస సెట్లలో అమెరికా ప్లేయర్ కీస్ మాడిసన్ పై గెలుపొంది సెమీస్ కు చేరుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్