Friday, September 20, 2024
HomeTrending Newsచైనా బొగ్గు గనిలో 14 మంది సజీవ సమాధి

చైనా బొగ్గు గనిలో 14 మంది సజీవ సమాధి

చైనాలో ఓ బొగ్గుగని కుప్పకూలిన ప్రమాదంలో 14 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. నైరుతి చైనాలోని గుయిజూ ప్రావీన్స్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇక్కడ ఉన్న బొగ్గు గనుల్లో సాన్హే షంగ్జన్ బొగ్గు గనిలో 25వ తేదీన పైకప్పు కూలిపోయింది. అక్కడ పని చేస్తున్న కార్మికులు అందులో చిక్కుకునిపోయారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు వారిని సురక్షితంగా రక్షించాయి.

అప్పటి నుంచి ఇప్పటివరకు సహయాక చర్యలు కొనసాగుతూనే వున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఈ  బొగ్గు గని నుంచి 14 మంది కార్మికుల మృతదేహాలను వెలికి తీశారు. మరికొంతమందిని ప్రాణాలతో రక్షించారు. గని ప్రవేశద్వారం నుంచి 3 కిలోమీటర్ల మేరకు పైకప్పు కూలిపోయింది. కూలిపోయిన పైకప్పు చాలా పెద్దది కావడంతో గనిలో చిక్కుకునివున్నవారిని రక్షించడం కష్టతరంగా మారింది. సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్