Saturday, April 20, 2024
Homeసినిమాచిరు, నక్కిన ప్రాజెక్ట్ సెట్ అయ్యిందా..?

చిరు, నక్కిన ప్రాజెక్ట్ సెట్ అయ్యిందా..?

చిరంజీవి ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. ప్రస్తుతం ‘భోళా శంకర్’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జంటగా తమన్నా నటిస్తుంటే.. సిస్టర్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమాను సమ్మర్ లో లేదా దసరాకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే… ‘ధమాకా’ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన నక్కిన త్రినాధరావుకు చిరంజీవి కథ ఉంటే చెప్పు సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.

లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఇటీవల నక్కిన త్రినాధరావు, చిరంజీవికి కథ చెప్పారట. లైన్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో ఫుల్ స్టోరీ రెడీ చేయమన్నారని.. సినిమా చేద్దామని మాట ఇచ్చారని తెలిసింది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య బ్యానర్ లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో చిరంజీవి ఓ సినిమా చేయాలి. వెంకీ కుడుమలతో సినిమా చేద్దామనుకున్నారు కానీ.. కథ పూర్తి స్థాయిలో నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. అప్పటి నుంచి ఈ బ్యానర్ లో సినిమా చేసేందుకు సరైన కథ కోసం చూస్తున్నారు.

అలాంటి టైమ్ లో నక్కిన చెప్పిన స్టోరీ లైన్ కొత్తగా, ఇంట్రస్టింగ్ గా ఉండడంతో ఓకే చెప్పారట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారని తెలిసింది. భోళా శంకర్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత నక్కిన త్రినాథరావుతో సినిమా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట. ఈ మూవీ పుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ అని సమాచారం. చిరంజీవిని అభిమానులు ఎలా చూడడానికి ఇష్టపడుతున్నారో అలా ఈ సినిమా ఉండేలా నక్కిన త్రినాథరావు ప్లాన్ చేస్తున్నారట. మరి.. వరుస సక్సెస్ సాధిస్తున్న నక్కిన త్రినాధరావు చిరంజీవితో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్