Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

24 క్రాఫ్టుల సినీ కార్మికులు నివసిస్తున్న చిత్రపురి కాలనీలో ఆస్పత్రి నిర్మించి ఇస్తానని మెగాస్టార్ చిరంజీవి మాటిచ్చారు. ఈ విషయాన్ని చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్రపురి కాలనీలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైటీ స్టార్ శ్రీకాంత్ అతిథిగా హాజరయ్యారు. బ్లడ్ డొనేషన్ చేసిన వారికి ప్రోత్సాహక బహుమతులను హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా కమిటీ సభ్యులు అందజేశారు.

ఈ సందర్భంగా చిత్రపురి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ రక్తదానం అంటే ప్రాణదానం చేయడమే. రక్తం సకాలంలో అందక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా రక్తదానం కోసం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం వెళ్లి కలిసినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు చిత్రపురి కాలనీలో ఆస్పత్రి నిర్మిస్తానని మాటిచ్చారు. గతంలోనూ మా సినీ కార్మికుల సమస్యల గురించి చాలా సేపు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. చిత్ర పరిశ్రమకు దాసరి గారు లేని లోటు చిరంజీవి గారు తీరుస్తున్నారు. చిత్రపురి కాలనీలో ఆస్పత్రి నిర్మాణానికి మాటిచ్చిన మెగాస్టార్ చిరంజీవి  గారికి మొత్తం సినీ కార్మికుల తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ… చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.  మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు ఇష్టం. అలా పాల్గొంటే ఆ పుణ్యం నాకు కూడా కొంత వస్తుందని నమ్ముతాను. సినీ కార్మికులంతా మన ఫ్యామిలీ. చిరంజీవి గారి మంచి మనసు గురించి మనందరికీ తెలుసు. కరోనా టైమ్ లో సీసీసీ ద్వారా చిత్ర పరిశ్రమలోని కార్మికులందరినీ ఆదుకున్నారు. అది కేవలం ఆయన ఒక్కటి ఆలోచన మాత్రమే. మేమంతా అందుకు సపోర్ట్ చేశాం. చిత్రపురి కాలనీలో ఆస్పత్రి నిర్మిస్తానని మెగాస్టార్ చెప్పడం సంతోషంగా ఉంది. అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రపురి కమిటీ   కార్యదర్శి కాదంబరి కిరణ్, సభ్యులు పీఎస్ఎన్ దొర, అళహరి, అనిత ఇతర కార్మిక యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com