Friday, March 29, 2024
HomeTrending Newsడోకిపర్రుకు చిరంజీవి దంపతులు

డోకిపర్రుకు చిరంజీవి దంపతులు

టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి సతీసమేతంగా కృష్ణా జిల్లా డోకిపర్రు విచ్చేశారు. ఇక్కడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించిన గోదాదేవి కల్యాణోత్సవానికి హాజరయ్యారు.

ఆలయ వర్గాలు చిరంజీవి, సురేఖ దంపతులకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికాయి. గోదాదేవి కల్యాణం అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.

కాగా, కల్యాణోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి కుటుంబం కూడా హాజరైంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్