Thursday, March 28, 2024
Homeసినిమాబాల‌య్య షోలో మెగాస్టార్. అభిమానుల‌కు పండ‌గే

బాల‌య్య షోలో మెగాస్టార్. అభిమానుల‌కు పండ‌గే

Two in Single frame:  నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రో వైపు అన్ స్టాప‌బుల్ అంటూ టాక్ షో చేస్తున్నారు. ఆహా కోసం బాల‌య్య చేసిన అన్ స్టాప‌బుల్ టాక్ షో సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. ఈ షోలో బాల‌య్య త‌న‌దైన స్టైల్ లో మాట్లాడి షోను ర‌క్తి క‌ట్టించారు. ఫ‌స్ట్ సీజ‌న్ స‌క్సెస్ ఫుల్ గా ముగిసింది. దీంతో సెకండ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ కానుంది.? ఈసారి గెస్ట్ లు ఎవరు రానున్నారు..? అనేది ఆస‌క్తిగా మారింది.

ఫ‌స్ట్ సీజ‌న్ లోనే మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రానున్నార‌ని టాక్ వ‌చ్చింది. దీంతో చిరంజీవి నుంచి బాల‌య్య ఎలాంటి స‌మాచారాన్ని రాబ‌డ‌తారు..?  ఎలాంటి ప్ర‌శ్న‌లు అడుగుతారు..? అని ఆస‌క్తిగా ఎదురు చూసిన వాళ్ల‌కు నిరాశే ఎదురైంది. ఈసారి సెకండ్ సీజ‌న్ లో మాత్రం చిరంజీవి రావ‌డం ప‌క్కా అని స‌మాచారం. అల్లు అర‌వింద్.. ఈ షో గురించి చిరంజీవికి చెప్పి.. గెస్ట్ గా రావాల‌ని అడిగితే వెంట‌నే వ‌స్తాన‌ని మాట ఇచ్చార‌ట‌.

చిరంజీవి, బాల‌య్య బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నువ్వా..?  నేనా..?  అన్న‌ట్టుగా పోటీప‌డ్డారు. ఇప్పుడు ఇద్ద‌రూ క‌లిసి స్క్రీన్ పై క‌నిపిస్తే అభిమానుల‌కు పండ‌గే. ఇంత‌కీ.. అన్ స్టాప‌బుల్ టాక్ షో సెకండ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ కానుంది అంటే.. ఆగ‌ష్టు నుంచి లేదా ద‌స‌రా నుంచి అని వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ టాక్ షో ఎప్పుడు స్టార్ట్ కానుంది అనేది అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌నున్నారు.

Also Read : అన్ స్టాప‌బుల్-2కు ముహుర్తం ఫిక్స్? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్