Friday, March 29, 2024
Homeసినిమాచిరు.. వెంకీ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేది ఎప్పుడు..?

చిరు.. వెంకీ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేది ఎప్పుడు..?

చిరంజీవి ఇటీవల ‘గాడ్ ఫాదర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చిరంజీవి ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య‘ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి వస్తుంది. ఈ సినిమా తర్వాత ‘భోళా శంకర్’ దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఉగాది ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో తమన్నా నటిస్తుంటే.. చెల్లెలు క్యారెక్టర్ లో కీర్తి సురేష్ నటిస్తుండడం విశేషం.

అయితే.. సెట్స్ పై ఉన్న ఈ సినిమాలు కాకుండా మారుతి తో ఓ సినిమా, వెంకీ కుడుములతో ఓ సినిమా చేయనున్నట్టుగా చిరంజీవి ప్రకటించారు. మారుతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక వెంకీ కుడుముల ‘ఛలో’, ‘భీష్మ’ సినిమాలతో వరుసగా సక్సెస్ సాధించినప్పటి నుంచి చిరంజీవితో సినిమా చేయాలని కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టుగా ప్రకటించడం కూడా జరిగింది. అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రావడంతో ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు.

దీంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. కారణం ఏంటంటే… వెంకీ కుడుముల మెగాస్టార్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోతున్నాడని వార్తలు గట్టిగానే చక్కర్లు కొట్టాయి. గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాబీ, మెహర్ రమేష్ లు ఉన్నారు కానీ వెంకీ కుడుముల మాత్రం కనిపించలేదు. ఆచార్యతో మొదలుపెడితే ఏ ప్రమోషన్ లోనూ చిరంజీవి తన ప్రస్తావన తీసుకురాలేదు. దీంతో ప్రచారంలో ఉన్న వార్త నిజమే అనిపిస్తుంది. వెంకీ కుడుముల వేరే హీరోతో సినిమా అనౌన్స్ చేసాడా అంటే అదీ లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఉందో లేదో అనేది సస్పెన్స్ గా మారింది. మరి.. త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్