పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికైన ఎంవి రామచంద్రా రెడ్డి, కర్నూలు సంస్థల నుంచి ఎన్నికైన ఏ. మధుసూదన్ లు నేడు అసెంబ్లీ ప్రాంగణంలోని సిఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారితో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా సిఎం జగన్ కొత్త ఎమ్మెల్సీలను అభినందించారు. నిత్యం ప్రజలతో మమేకమై పని చేయాలని సూచించారు.

Also Read :  ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *